తెలంగాణ

telangana

ETV Bharat / state

సెలవులకు ఊరు వెళ్లి... ఓటు వేయడం మరవద్దు

మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉదయమే ప్రచారం ప్రారంభించారు. క్రికెట్ ఆడుతూ, యోగా చేస్తూ ఓట్లు అభ్యర్థించారు.

By

Published : Mar 27, 2019, 9:08 AM IST

Updated : Mar 27, 2019, 11:50 AM IST

యోగ చేస్తూ రేవంత్ ప్రచారం

యోగా చేస్తూ రేవంత్ ప్రచారం
మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​లోని హెచ్​ఎంటీ గ్రౌండ్స్​ వద్ద ప్రచారాన్ని నిర్వహించారు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి. అత్యంత తక్కువ శాతం పోలింగ్​ నమోదయ్యే కేంద్రం మల్కాజిగిరి అని... ఎన్నికల సమయంలో సెలవులున్నాయని ఊరు వెళ్లి ఓటు వేయడం మర్చిపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మరో పదిమందితో ఓటు వేయించేలా చొరవ తీసుకోవాలని కోరారు. హెచ్​ఎంటీ మైదానంలో యువతతో కలిసి క్రికెట్ ఆడి... యోగా కేంద్రంలో ధ్యానం చేశారు. తనను ఎంపీగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన వెంటనే నియోజకవర్గంలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Last Updated : Mar 27, 2019, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details