తెలంగాణ

telangana

ETV Bharat / state

గడప గడపకు వెళతా... గెలుస్తా : రేవంత్​రెడ్డి - congress mp candidate

మల్కాజిగిరి లోక్​సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్​ రెడ్డి అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా  సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి తాను గెలవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించనున్నారు. ఈ నెల 22న భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేయనున్నారు.

ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తా

By

Published : Mar 18, 2019, 11:20 PM IST

Updated : Mar 19, 2019, 7:13 AM IST

ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తా
మల్కాజిగిరి పార్లమెంటు స్థానం పరిధిలో మేడ్చల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో 16 లక్షలకు పైగా ఓటర్లున్నారు. 2014లో ఈ స్థానం నుంచి తెదేపా తరఫున మల్లారెడ్డి గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్​ పార్టీ రేవంత్​రెడ్డిని బరిలోకి దింపింది. ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నందున నియోజక వర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్ల బలాన్ని కూడగట్టుకుంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారమవుతాయని రేవంత్​ రెడ్డి అన్నారు.

మద్దతుదారులతో చర్చలు

అధిష్ఠానం నుంచి ప్రకటన రాగానే లోక్​సభ సీటు ఆశిస్తున్న కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌తో రేవంత్​ రెడ్డి చర్చలు జరిపారు. తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్​రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను కలసి మద్దతు కోరారు. వారంతా సానుకూలంగా స్పందించారని తెలిపారు.

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఇష్టం లేకపోయినా సీనియర్​ నాయకుల సలహా మేరకే బరిలోకి దిగానని రేవంత్​ రెడ్డి అన్నారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

ఇదీ చదవండి:"కేసీఆర్​పై చర్యలు తీసుకోండి"

Last Updated : Mar 19, 2019, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details