తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ - ts rtc strike issue

మేడ్చల్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి ఐటీఐ కళాశాల వరకు ర్యాలీ చేపట్టారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్షం ర్యాలీ

By

Published : Oct 15, 2019, 6:21 PM IST

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా మేడ్చల్​లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. డిపో ఎదుట జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు విక్రమ్ రెడ్డి, కాంగ్రెస్​ జడ్పీ ఫ్లోర్ లీడర్ సింగి రెడ్డి హరివర్దన్​ రెడ్డి పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాస్తారోకో సందర్భంగా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details