లాక్డౌన్ సమయంలో కూకట్పల్లికి ఉపాధి నిమిత్తం వచ్చి హైదరాబాద్లోనే ఉండిపోయిన ఓ కుటుంబానికి… తమ సొంత గ్రామానికి చేరుకునేందుకు కూకట్పల్లి పోలీసులు ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ కాంట్రాక్టర్ మాటలు విని హైదరాబాద్ వచ్చి మోసపోయిన ఆ కుటుంబాన్నివారి ఇంటికి పంపేందుకు పోలీసులు ఆర్థిక సహాయం చేసి అవసరమైన టికెట్లను అందజేశారు.
ఏపీలోని ఒంగోలుకి చెందిన నాగరాజుకు నాలుగు రోజుల క్రితం కూకట్పల్లి నుంచి ఓ కాంట్రాక్టర్ ఫోన్ చేసి పని ఉందని రావాల్సిందిగా తెలిపాడు. కాంట్రాక్టర్ మాటలు నమ్మిన నాగరాజు తన భార్య, ఇద్దరు పిల్లలతో ఒంగోలు నుంచి కూకట్పల్లికి వచ్చి కాంట్రాక్టర్కు ఫోన్ చేశాడు. కాంట్రాక్టర్ ఫోన్ స్విచాఫ్ రావడంతో తెచ్చుకున్న డబ్బులు సైతం అయిపోయాయి.