తెలంగాణ

telangana

By

Published : Oct 1, 2019, 6:16 AM IST

Updated : Oct 1, 2019, 10:38 AM IST

ETV Bharat / state

అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు

నగర శివారు జీడిమెట్ల సమీపంలోని ఓ అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది.

అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం.. చేలరేగిన మంటలు

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సర్కిల్​ జీడిమెట్ల సమీపంలో ఓ గృహ సముదాయంలోని ఫ్లాట్​లో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సీలింగ్, ఫర్నీచర్ మంటలకు ఆహూతయ్యాయి. అపార్ట్ మెంట్ వాసులు అగ్ని మాపక సిబ్బందికి, పోలీస్ స్టేషన్​కు సమాచారం తెలియజేశారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వర్షాకాలం కావడం వల్ల మంటలు ప్రక్కన గదులకు చేరుకేలేదు. పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం.. చెలరేగిన మంటలు
Last Updated : Oct 1, 2019, 10:38 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details