తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2020, 5:15 PM IST

ETV Bharat / state

'చిన్నపిల్లలకు పారిశుద్ధ్యం, హరితహారంపై అవగాహన కల్పించాలి'

వానాకాలం నేపథ్యంలో అంటువ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అల్విన్​ కాలనీ డివిజన్​ కార్పొరేటర్​ వెంకటేశ్​ గౌడ్​ సూచించారు. ప్రతి ఒక్కరూ తమ నివాసాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతోపాటు కాలనీలను కూడా శుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

Medchal district latest news
Medchal district latest news

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి జయనగర్ కాలనీలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన రోడ్లు, కాలనీ రహదారులపై పేరుకున్న చెత్తాచెదారాన్ని తొలగించారు. ఇళ్లలో వెలువడే చెత్తాచెదారాన్ని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఆటోల వారికి మాత్రమే ఇవ్వాలని అల్విన్​ కాలనీ డివిజన్​ కార్పొరేటర్​ వెంకటేశ్​ గౌడ్​ సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా ఖాళీ ప్రదేశంలో వేయకూడదన్నారు.

చిన్నపిల్లలకు పారిశుద్ధ్యం, హరితహారంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తన మనవడితో మొక్కలు నాటించారు.

ABOUT THE AUTHOR

...view details