తెలంగాణ

telangana

కబ్జాకోరల నుంచి బయటపడ్డ కిందికుంట చెరువు

By

Published : Jul 2, 2020, 10:40 AM IST

శేరిలింగంపల్లి నియోజకవర్గం.. కూకట్​పల్లి మండలం హైదర్​నగర్ పరిధిలోని కిందికుంట చెరువులోని ఆక్రమణలను అధికారులు కూల్చివేశారు. చెరువు కబ్జాకోరల్లో చిక్కుకుపోతోందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులతో రెవెన్యూ, జీహెచ్​ఎంసీ, ఇరిగేషన్ అధికారులు చెరువును పరిశీలించి.. ఆక్రమణలను తొలగించారు.

Officers removed the encroachments in the kindikunta pond
కబ్జాకోరల నుంచి బయటపడ్డ కిందికుంట చెరువు

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా కూకట్​పల్లి మండలం హైదర్​నగర్​ పరిధిలోని సర్వే నెంబర్ 119లో ఉన్న 8 ఎకరాల 17 గుంటల్లో చెరువు విస్తరించి ఉండేది. గతంలో కొంత ఆక్రమణకు గురై.. ప్రస్తుతం 6 ఎకరాల 20 గుంటలకు చేరింది. చెరువులో పేరుకుపోయిన చెత్తను తొలగించి.. మురికిని శుభ్రం చేయాలని ఎప్పటి నుంచో స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరో విడత హరితహారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చెరువు సుందరీకరణ పనులు చేపట్టారు. అందులో భాగంగా వాకింగ్​ ట్రాక్​ను ఏర్పాటు చేశారు.

చెరువులో కొందరు అక్రమ కట్టడాలు నిర్మించారని స్థానికులు ఆరోపించారు. ఎఫ్​టీఎల్​ పరిధిని వదిలి సుందరీకరణ చేపట్టారని తెలిపారు. ఆక్రమణలపై స్పందించిన ఎమ్మెల్యే అరికెపూడి... ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాదారులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

ఎఫ్​టీఎల్​ స్థలాన్ని కలుపుకోవడం వల్ల 800 గజాల స్థలం కలిసి వస్తుందని కూకట్​పల్లి తహసీల్దారు సంజీవరావు పేర్కొన్నారు. ఎఫ్​టీఎల్​ ప్రాంతంలో రోడ్డును ఏర్పాటు చేస్తున్నామని.. దాని ద్వారా చెరువును సంరక్షించవచ్చని తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది.. పర్యాటక ప్రదేశంగా మారుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అక్రమార్కులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

కబ్జాకోరల నుంచి బయటపడ్డ కిందికుంట చెరువు

ఇదీచూడండి: విద్యార్థులకు ఉచిత ల్యాప్​టాప్​లు ఇవ్వనున్న కేంద్రం!

ABOUT THE AUTHOR

...view details