తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడ్చల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్​ నియామకం - telangana varthalu

మేడ్చల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్​ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్​ నియమించారు. తనను నియమించినందుకు ఆయన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.

మేడ్చల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్​ నియామకం
మేడ్చల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్​ నియామకం

By

Published : Mar 4, 2021, 10:41 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్ నియామకమయ్యారు. ఇటీవల మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ డీసీసీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే దిల్లీ వెళ్లి భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు.

దీనితో మేడ్చల్ జిల్లా డీసీసీ నూతన అధ్యక్షుడిగా నందికంటి శ్రీధర్​ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియమించారు. తనపై నమ్మకంతో డీసీసీ అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీ అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నాయకులకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి: ఆదివారాల్లో పనిచేయనున్న సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details