మేడ్చల్ జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్లకు సూరారంలోని యూపీహెచ్సీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యామ్సన్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కలిసి ప్రారంభించారు.
కరోనా మహమ్మారి నుంచి అందరినీ కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. అందులో భాగంగానే హైరిక్స్ కేటగిరీలో ఉన్న ట్రాన్స్జెండర్లకు వాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని స్పష్టం చేశారు. ఏడు రోజుల పాటు ఈ కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుందన్నారు.