తెలంగాణ

telangana

ETV Bharat / state

'విద్యా సంస్థలకు 8500 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం'

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి కలిసి పర్యటించారు. పలు సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యాసంస్థలకు సన్నబియ్యం సరఫరా చేశామని తెలిపారు.

By

Published : Jan 31, 2021, 3:37 PM IST

ministers-gangula-kamalakar-and-malla-reddy-visits-welfare-hostels-and-schools-in-medchal-malkajgiri-district
విద్యాసంస్థలకు 8500 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం: మంత్రి గంగుల

ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న విద్యా సంస్థలకు 8,500 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేశామని బీసీ సంక్షేమ, పౌర సఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో ఏర్పాట్లు పరిశీలించారు.

కూకట్​పల్లి, సనత్ నగర్ సంక్షేమ హాస్టళ్లు, అంకిరెడ్డిపల్లి సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు మొత్తం 70,872 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

ఇదీ చదవండి:శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయాలు: చల్లా ధర్మారెడ్డి

ABOUT THE AUTHOR

...view details