తెలంగాణ

telangana

రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్​ జిల్లా మూడుచింతలపల్లిలో రైతువేదిక నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి మొక్కలు నాటారు.

By

Published : Jul 3, 2020, 5:31 PM IST

Published : Jul 3, 2020, 5:31 PM IST

Minister Mallareddy to establish the raitu vedika in medchal
రైతువేదిక నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్​ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు చెక్కులను అందజేశారు. కరోనా వైరస్​ను అరికట్టడానికి ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులను కూడా లీజుకు తీసుకుని రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details