తెలంగాణ

telangana

ETV Bharat / state

Isolation center: ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి - Establishment of Isolation Center at Srirangavaram, Medical District

మేడ్చల్ జిల్లా శ్రీరంగవరంలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కరోనా సోకిన నిరుపేద ప్రజలందరూ ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

minister mallareddy inuagurated isolation center at medchal
ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

By

Published : May 29, 2021, 1:05 PM IST

మేడ్చల్ జిల్లాలోని శ్రీ రంగవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. లాక్​డౌన్ నేపథ్యంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు. అలాగే గ్రామ గ్రామాన ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం మంచి పరిణామం అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందరికీ బెడ్​లు అందుబాటులో ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి కరోనా అంతమొందించడానికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ సభ్యురాలు శైలజ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు విజయానంద రెడ్డి, తెరాస నాయకులు ఉన్నారు.

ఇదీ చదవండి :Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details