తెలంగాణ

telangana

'సమ్మెను అణిచివేసేందుకు యత్నిస్తున్నవారికి ఓటమి తప్పదు'

By

Published : Nov 15, 2019, 7:50 PM IST

మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరై... మద్దతు తెలిపారు.

'సమ్మెను అణచివేసేందుకు యత్నిస్తున్నవారికి ఓటమి తప్పదు'

మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల డిపో వద్ద 42వ రోజు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ఆర్టీసీని కాపాడుకోవాలనే విషయంలో ప్రజలంతా మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసే ఉద్యమాన్ని కార్మికులు చేపడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ రోడ్డెక్కుతున్నారన్నారు. ఇదే సంకల్పంతో ఉద్యమం కొనసాగితే ఎన్నటికైనా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఓటమి తప్పదని హెచ్చరించారు.

'సమ్మెను అణచివేసేందుకు యత్నిస్తున్నవారికి ఓటమి తప్పదు'

ABOUT THE AUTHOR

...view details