బంగారు తెలంగాణ సాకారనికి సీఎం కేసీఆర్ అలుపెరుగని ప్రయత్నం చేస్తున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజక వర్గ ఇంఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్ మెప్మాలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ రిసోర్స్ పర్సన్ సంఘం వారు ఆయన నివాసంలో కలిశారు. శాలువాతో సన్మానించి.. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అలుపెరుగని ప్రయత్నం
సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాకారం చేసేందుకు అలుపెరుగని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతు బంధు పథకం యావత్ దేశానికే ఆదర్శమని కొనియాడిన ఆయన. అన్ని వర్గాల ప్రజా సక్షేమమే లక్ష్యంగా పథకాల రూపకల్పన చేశారని పునరుద్ఘాటించారు.