తెలంగాణ

telangana

By

Published : May 16, 2020, 1:09 PM IST

ETV Bharat / state

వలస కార్మికులకు బత్తాయి పండ్ల పంపిణీ

ఘట్​కేసర్​ రైల్వే స్టేషన్​లో 3వేల మంది వలస కార్మికులకు తెరాస నాయకుడు మర్రి రాజశేఖర్​ రెడ్డి బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. ఈ పండ్లను తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.

Malkaghiri Parliament Member Marri Rajshekar reddy Distributes Battai Fruits for Migrant Labours in Ghatkesar railway Station
వలస కూలీలకు బత్తాయి పండ్ల పంపిణీ

మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌లో సుమారు 3వేల మంది వలస కార్మికులకు తెరాస నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు పాల్గొని కూలీలకు పండ్లు అందించారు. విటమిన్‌ సి అధికంగా ఉండే బత్తాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆయన సూచించారు. కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details