అపస్మారక స్థితిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణాలను మేడ్చల్ జిల్లా కీసర పోలీసులు కాపాడారు. ఉపాధి కోసం అసోం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిరంజన్ అనే వ్యక్తి... నాగారం సమీపంలోని రాంపల్లి ఆర్ఎల్ నగర్ చెరువు సమీపంలో ఆకలితో అలమటిస్తూ చెట్లపొదల్లో పడిపోయారు. అది గమనించిన స్థానికులు కీసర పోలీసులకు సమాచారం అందించారు.
కొనఊపిరితో ఉన్న వ్యక్తిని కాపాడిన కీసర పోలీసులు - medchal district latest news
మేడ్చల్ జిల్లా నాగారం సమీపంలోని రాంపల్లి ఆర్ఎల్ నగర్ చెరువు సమీపంలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణాలను కీసర పోలీసులు కాపాడారు. ఉపాధి కోసం అసోం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిరంజన్ అనే వ్యక్తి... ఆకలితో అలమటిస్తూ చెట్లపొదల్లో పడిపోయారు. గమనించిన కీసర పెట్రోలింగ్ పోలీసులు... ఓ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ప్రథమ చికిత్స అందించారు.
![కొనఊపిరితో ఉన్న వ్యక్తిని కాపాడిన కీసర పోలీసులు Keesara police rescued a man, Medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12267066-1077-12267066-1624689980885.jpg)
మానవత్వం చాటుకున్న కీసర పోలీసులు, పోలీసుల మానవత్వం,
మానవత్వం చాటుకున్న కీసర పోలీసులు, పోలీసుల మానవత్వం,
వెంటనే అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు... ఓ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం బాధితున్ని యాప్రాల్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిరంజన్ క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా... సకాలంలో స్పందించిన కీసర పోలీసులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను... స్థానికులు అభినందనలతో ముంచెత్తారు.
ఇదీ చదవండి: కాసేపట్లో పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యాచరణపై సీఎం సమీక్ష