ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు మంగళవారం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్.. స్థానిక షాహాతిం చెరువును పరిశీలించారు. జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారులు, నానాల్ నగర్ కార్పొరేటర్ నసీరుద్దీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
షాహాతిం చెరువును పరిశీలించిన కార్వాన్ ఎమ్మెల్యే - karwan mla at shahatim river
కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్.. నియోజకవర్గ పరిధిలోని షాహాతిం చెరువును జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువు వద్ద త్వరలోనే పనులు మొదలవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.
షాహాతిం చెరువును పరిశీలించిన కార్వాన్ ఎమ్మెల్యే
కార్వాన్ ఎమ్మెల్యే చెరువు వద్ద మిగులు ఛానెల్ పనులను పరిశీలించారు. వచ్చే వారం రోజుల్లో ఇక్కడ పనులు మొదలవుతాయని.. దాని వల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదని ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ తెలిపారు.
ఇదీ చూడండి:చోరీ కేసును ఛేదించిన పోలీసులు... 62 తులాల బంగారం స్వాధీనం