కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు.. పేదింటి ఆడబిడ్డలకు వరమని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను 62 మంది లబ్ధిదారులకు మేయర్ జక్కా వెంకట్రెడ్డితో కలిసి ఆయన అందజేశారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి - పీర్జాదిగూడలో మంత్రి మల్లారెడ్డి లేటెస్ట్ వార్తలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీకి చెందిన 62 మంది లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి.. మేయర్ జక్కా వెంకట్రెడ్డితో కలిసి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి
పేదింట్లో పెళ్లికి ఆర్థికంగా ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి వెల్లడించారు. అనంతరం మున్సిపాలిటీకి చెందిన పారిశుద్ధ్య వాహనాలను(ఆటోలు), వీధి కుక్కల నియంత్రణ కేంద్రం, సీసీ రోడ్డు పనులు, పార్కును మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.
ఇదీ చదవండిఃఎల్ఆర్ఎస్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలి: మల్లారెడ్డి