'కాంగ్రెస్, తెదేపాలు మైనార్టీలకు సాయం చేయలేదు' ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ, ఘట్కేసర్ పుర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ రాకముందు అంధకారంలో బతికిన ప్రజలకు, 24 గంటల విద్యుత్తు సరఫరా చేసిన ఘనత కేసీఆర్ సర్కాదేనని మంత్రి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలు ఏనాడు మైనార్టీలకు సాయం చేయలేదని మండిపడ్డారు.
కారుగుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు హోంమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు.