మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ ఈఎస్ఐ హస్పిటల్లో మధుమేహం, కిడ్నీ, క్యాన్సర్ రోగులకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద మెడికల్ కిట్స్ అందించారు.
'ఇకపై ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉండదు' - మేడ్చల్ జిల్లా వార్తలు
ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉందని... ఇప్పటి నుంచి ఆ పరిస్థితి ఉండదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. షాపూర్లోని ఈఎస్ఐ ఆస్పత్రిలోని రోగులకు... ఎమ్మెల్యే వివేకానందతో కలిసి మెడికల్ కిట్స్ అందించారు.
'ఇకపై ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల కొరత ఉండదు'
రాష్ట్రంలో ఉన్న 73 ఈఎస్ఐ ఆస్పత్రులలో ఇప్పటి నుంచి మందుల కొరత ఉండదని... ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రక్రియని ప్రారంభించిందని మంత్రి తెలిపారు. షాపూర్ ఆస్పత్రిలోనే 1100 మంది కిడ్నీ, 500 మంది క్యాన్సర్ రోగులు ఉన్నారని... వారికి ప్రభుత్వం మందులు ఇచ్చి ఆదుకుంటుందని వెల్లడించారు.
ఇదీ చూడండి:వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డుల స్వాధీనానికి ప్రభుత్వం ఆదేశం