తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళలు తీసుకోవాల్సిన స్వీయ రక్షణ చర్యలపై అవగాహన సదస్సు - Etv Eenadu Sadasu

ఒంటరిగా ప్రయాణించే మహిళలు, యువతులు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే డయల్​ 100కు కాల్​ చేయాలని ఘట్​కేసర్​ ఇన్​స్పెక్టర్​ రఘువీర్​ రెడ్డి సూచించారు. మేఘా మహిళా ఇంజినీరింగ్​ కళాశాలలో మహిళలు తీసుకోవాల్సిన స్వీయ రక్షణ చర్యలపై ఈటీవీ భారత్, ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

Etv Eenadu Sadasu
Etv Eenadu Sadasu

By

Published : Dec 2, 2019, 7:27 PM IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వేగంగా స్పందించే పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ... సరైన అవగాహన లేక అమ్మాయిలు ప్రమాదంలో చిక్కుకుంటున్నారని ఘట్​కేసర్​ ఇన్​స్పెక్టర్​ రఘువీర్​ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఎదులాబాద్​లోని మెగా మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఈటీవీ భారత్, ఈనాడు, ఫెస్టివ్ ఫోక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోటోల్ ఫ్రీ నెంబర్​లపై అవగాహన సదస్సు నిర్వహించారు.


చుట్టుపక్కల వాతావరణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని విద్యార్థినీలకు రఘువీర్​ రెడ్డి సూచించారు. వెంటనే డయల్​ 100కు కాల్​ చేయాలన్నారు. దిశ ఘటనలో నిందితులను 15 రోజుల్లో శిక్షించాలని ఫెస్టివ్ ఫోక్స్ అసోసియేషన్ ఛైర్ పర్సన్ ఎడ్లపాటి ఉమ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మహిళలు తీసుకోవాల్సిన స్వీయ రక్షణ చర్యలపై అవగాహన సదస్సు

ఇవీ చూడండి : విషాదం.. రెండు ప్రేమజంటల బలవన్మరణం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details