తెలంగాణ

telangana

లాక్ డౌన్ అమలును పరిశీలించిన సీపీ సజ్జనార్

By

Published : May 23, 2021, 12:29 PM IST

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలును సీపీ సజ్జనార్ పరిశీలించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు.

cp
cp

సైబరాాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలును సీపీ సజ్జనార్ పరిశీలించారు. వీధుల వెంట తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు. ఉదయం పది తర్వాత పరిస్థితి ఎలా ఉందో జగద్గిరిగుట్ట, చింతల్, షాపూర్ నగర్, ఆల్విన్ కాలనీ ప్రాంతాల్లో పరిశీలించారు. తెరిచి ఉంచిన దుకాణాలను మూయించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు సీపీ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details