తెలంగాణ

telangana

ETV Bharat / state

బోడుప్పల్​లో మరో వ్యక్తికి కరోనా... భద్రత కట్టుదిట్టం - coronavirus case in boduppal latest case

హైదరాబాద్​ శివారులోని బోడుప్పల్​లో తాజాగా ఓ వ్యక్తికి కరోనా సోకగా ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కొవిడ్​ బారిన పడిన వ్యక్తి నివాసమున్న కాలనీని మంత్రి మల్లారెడ్డి పరిశీలించి...రాకపోకలను నిలిపివేశారు.

coronavirus-case-in-boduppal
బోడుప్పల్​లో మరో వ్యక్తికి కరోనా... భద్రత కట్టుదిట్టం

By

Published : Apr 21, 2020, 7:11 PM IST

హైదరాబాద్​ శివారులో కరోనా కలకలం సృష్టిస్తోంది. బోడుప్పల్​లోని ఓ కాలనీలో వ్యాపారికి పాజిటివ్​ తేలగా.. పట్టణంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో కరోనా వైరస్​తో ఓ వ్యక్తి మృతి చెందగా అతని భార్య, మనవడికి వైరస్​ లక్షణాలు కనిపించగా వారిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాజాగా బోడుప్పల్​లో మరో వ్యక్తిని వైద్యులు ఆసుపత్రికి తరలించారు.

కరోనా వైరస్​ నియంత్రణలో భాగంగా లాక్​డౌన్​ ఉల్లంఘిస్తున్న వారిని అదుపు చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. కొవిడ్​ సోకిన వ్యక్తి నివాసమున్న కాలనీని మంత్రి మల్లారెడ్డి, మేయర్​ సామ బుచ్చిరెడ్డి, పోలీసులు సందర్శించారు. అనంతరం రసాయన ద్రవ్యం పిచికారీ చేసి కాలనీలోకి రాకపోకలను నిలిపివేశారు.

ఇదీ చదవండి:సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

ABOUT THE AUTHOR

...view details