హైదరాబాద్ శివారులో కరోనా కలకలం సృష్టిస్తోంది. బోడుప్పల్లోని ఓ కాలనీలో వ్యాపారికి పాజిటివ్ తేలగా.. పట్టణంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో కరోనా వైరస్తో ఓ వ్యక్తి మృతి చెందగా అతని భార్య, మనవడికి వైరస్ లక్షణాలు కనిపించగా వారిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాజాగా బోడుప్పల్లో మరో వ్యక్తిని వైద్యులు ఆసుపత్రికి తరలించారు.
బోడుప్పల్లో మరో వ్యక్తికి కరోనా... భద్రత కట్టుదిట్టం - coronavirus case in boduppal latest case
హైదరాబాద్ శివారులోని బోడుప్పల్లో తాజాగా ఓ వ్యక్తికి కరోనా సోకగా ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కొవిడ్ బారిన పడిన వ్యక్తి నివాసమున్న కాలనీని మంత్రి మల్లారెడ్డి పరిశీలించి...రాకపోకలను నిలిపివేశారు.
![బోడుప్పల్లో మరో వ్యక్తికి కరోనా... భద్రత కట్టుదిట్టం coronavirus-case-in-boduppal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6883712-thumbnail-3x2-boduppal.jpg)
బోడుప్పల్లో మరో వ్యక్తికి కరోనా... భద్రత కట్టుదిట్టం
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ ఉల్లంఘిస్తున్న వారిని అదుపు చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. కొవిడ్ సోకిన వ్యక్తి నివాసమున్న కాలనీని మంత్రి మల్లారెడ్డి, మేయర్ సామ బుచ్చిరెడ్డి, పోలీసులు సందర్శించారు. అనంతరం రసాయన ద్రవ్యం పిచికారీ చేసి కాలనీలోకి రాకపోకలను నిలిపివేశారు.