తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇటలీ నుంచి వచ్చిన మహిళకు అనారోగ్యం.. కరోనాగా అనుమానం' - Coronavirus Latest News

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లికి చెందిన ఓ మహిళ కరోనా పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రిలో చేరింది. ఇటీవలే ఇటలీ నుంచి నగరానికి వచ్చిన ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది.

corona
corona

By

Published : Mar 4, 2020, 10:04 PM IST

కరోనా పరీక్షల నిమిత్తం మేడ్చల్​ మల్కాజిగిరికి చెందిన ఓ మహిళా(35) గాంధీ ఆసుపత్రిలో చేరింది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన ఆమె అనారోగ్యంతో ఉండటం వల్ల ఇంట్లో ఉండకుండా... హోటళ్ల​లో బస చేసినట్లు తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆమె ఇటలీ నుంచి ఎప్పుడు వచ్చింది... ఎక్కడెక్కడ బసచేసిందనే వివరాలతో మేడ్చల్ జిల్లా వైద్యాధికారులకు నివేదిక పంపారు.

నివేదిక ఆధారంగా మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వేలెన్స్ టీం అధికారి, డిప్యూటీ జిల్లా వైద్యాధికారులు... వివరాల కోసం ఆమె బస చేసిన హోటల్ కి వెళ్లగా... యాజమాన్యం వివరాలు ఇవ్వలేదు. సదరు వైద్యులు పేట్​ బషీరాబాద్ ఏసీపీ, కొంపల్లి మున్సిపల్ కమిషనర్​లకు విషయం తెలిపారు. ఏసీపీ సూచనతో ఎస్సై ఆధ్వర్యంలో అధికారులు హోటల్​కి వెళ్లి వివరాలు ఆరా తీశారు. ఈ వివరాలను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.

'కొంపల్లిలో కరోనా కలవరం... ఓ మహిళకు గాంధీలో పరీక్షలు'

ఇదీ చూడండి :కరోనా వ్యాప్తి, నివారణ, సంసిద్ధతపై పీఎంఓ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details