తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవేంద్రనగర్​లో నిర్బంధ తనిఖీలు

నేరరహిత సమాజం కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్​ పరిధిలోని దేవేంద్రనగర్​లో సోదాలు నిర్వహించారు.

By

Published : Jan 17, 2020, 7:15 PM IST

corden search in medchal district
దేవేంద్రనగర్​లో నిర్బంధ తనిఖీలు

మేడ్చల్ జిల్లా జవహర్​నగర్ పీఎస్​ పరిధిలోని దేవేంద్ర నగర్​లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో సోదాలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 12 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

కాలనీలో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులకు డీసీపీ రక్షితమూర్తి సూచించారు.

దేవేంద్రనగర్​లో నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి: పోలీసులమని బెదిరించి రూ.9 లక్షల 50 వేలు వసూలు

ABOUT THE AUTHOR

...view details