కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులతో మాట్లాడుతున్నామని.. పరిస్థితులన్నీ త్వరలోనే సర్దుకుంటాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డిని.. మల్కాజిగిరి పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో షబ్బీర్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కొద్ది సేపు ఇరువురు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ కార్యకర్తలంతా సిపాయిలుగా పనిచేయాల్సిన సమయం ఇది. యువత.. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటోంది. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం. -షబ్బీర్ అలీ, కాంగ్రెస్ మాజీ మంత్రి
కాంగ్రెస్ కార్యకర్తలంతా సిపాయిల్లా పనిచేయాలి: షబ్బీర్ అలీ
ఫిక్సింగ్ జలజగడం