పోలింగ్ కేంద్రానికి తెరాస కార్యకర్తలు గులాబీ రంగు చొక్కాలు ధరించి రావటంపై.. భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న అనంతరం.. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది.
గులాబీ చొక్కా వివాదం.. తెరాస-భాజపాల మధ్య వాగ్వాదం - తెరాస-భాజపాల మధ్య వాగ్వాదం
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలింగ్ కేంద్రంలో తెరాస- భాజపా వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గులాబీ రంగు చొక్కా వేసుకుని వచ్చిన తెరాస కార్యకర్తలను.. కమలం నేతలు కేంద్రంలోనికి రాకుండా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది.
![గులాబీ చొక్కా వివాదం.. తెరాస-భాజపాల మధ్య వాగ్వాదం Conflict between Trs and bjp in mlc elections in malkajgiri medchal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11007957-1104-11007957-1615736125671.jpg)
గులాబీ చొక్కా వివాదం.. తెరాస-భాజపాల మధ్య వాగ్వాదం
పార్టీ రంగు చొక్కా వేసుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చిన తెరాస కార్యకర్తలను.. కమలం నేతలు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు.. అందరిని అక్కడినుంచి పంపివేశారు.
ఇదీ చదవండి:ఓటర్లకు డబ్బుల పంపిణీ!.. వైరల్ అయిన వీడియో