తెలంగాణ

telangana

By

Published : Dec 21, 2020, 3:56 PM IST

ETV Bharat / state

ఇంటింటికీ వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పేద ఆడబిడ్డలకు పెళ్లి భారం కాకూడదనే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ పథకాలను ప్రవేశపెట్టిందని మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే కేపీ వివేకానంద​ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సుభాష్​నగర్​ డివిజన్​లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందించారు.

cheques distribution by khuthbullapur mla  kp vivekanand in subhashnagar division in medchal dist
ఇంటింటికీ వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ పథకాలతో ఆడబిడ్డల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద​ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సుభాష్​నగర్​ డివిజన్​లో పలు కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి 17 మంది లబ్ధిదారులకు రూ.17,01,972 విలువైన చెక్కులను అందజేశారు.

పేద ఆడబిడ్డలకు పెళ్లి భారం కాకూడదనే ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. డివిజన్​లోని హమీద్​ బస్తీ, నర్సింహా బస్తీ, ప్రియాంకనగర్​, మైత్రినగర్​, తెలుగుతల్లినగర్​, ఆనంద్​నగర్​లలో ఇంటింటికీ వెళ్లి చెక్కులను అందించారు. అర్హులైన ప్రతిఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇదీ చూడండి:పార్టీలకతీతంగా అభివృద్ధికి కృషి చేయాలి : బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details