తెలంగాణ

telangana

ETV Bharat / state

బంద్​ను విజయవంతం చేస్తాం: మంద సంజీవరెడ్డి

ఈనెల 8న తలపెట్టిన బంద్​ను విజయవంతం చేస్తామని బోడుప్పల్ తెరాస అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి తెలిపారు. కార్యకర్తలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

By

Published : Dec 7, 2020, 12:18 PM IST

boduppal trs president manda sanjiv reddy about bharat bandh
బంద్​ను విజయవంతం చేస్తాం: మంద సంజీవరెడ్డి

దేశ వ్యాప్తంగా ఈనెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్​లో కార్యకర్తలంతా పాల్గొనాలని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ తెరాస అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ బుచ్చిరెడ్డి, కొత్త లక్ష్మీ రవి గౌడ్ పలువురు కార్పొరేటర్లతో కలిసి పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ పిలుపుతో బంద్​ను విజయవంతం చేస్తామని సంజీవ రెడ్డి పేర్కొన్నారు. వ్యాపారులు, ప్రైవేటు సంస్థలు స్వచ్ఛందంగా బంద్​లో పాల్గొనాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన దిల్లీ సీఎం

ABOUT THE AUTHOR

...view details