నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొనసాగుతోంది. కాప్రా సర్కిల్, ఈసీఐఎల్ చౌరస్తాలో సీపీఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆ చట్టాలను రద్దు చేయాలని 150 రోజుల నుంచి రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ప్రధాని మోదీ పాలన' - తెలంగాణ వార్తలు
సాగు చట్టాలను నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్ మేడ్చల్ జిల్లాలో కొనసాగుతోంది. ఈ ధర్నాలో సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు. 150 రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
!['కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ప్రధాని మోదీ పాలన' bharat bandh in medchal, medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11165169-thumbnail-3x2-cpi---copy.jpg)
మేడ్చల్లో భారత్ బంద్, మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా ప్రధాని మోదీ పాలన ఉందని ఆరోపించారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్కి తరలించారు.
ఇదీ చదవండి:'సాగు కూలీలకూ రైతు బీమా వర్తింపుపై నిర్ణయం తీసుకుంటాం'