మేడ్చల్ జిల్లా నేరేడిమెట్లో కాంగ్రెస్ నేతలు పర్యటించారు. రెండురోజుల క్రితం ప్రమాదవశాత్తు నాలాలోపడి మృతి చెందిన బాలిక... సుమేధ కుటుంబాన్ని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఇతర నాయకులు పరామర్శించారు.
సుమేధ కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ - తెలంగాణ వార్తలు
నేరేడ్మేట్ కాకతీయనగర్లో రెండు రోజుల క్రితం నాలలో పడి మృతి చెందిన చిన్నారి... సుమేధ కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

నాలాలో పడి మృతి చెందిన బాలిక కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ
అనంతరం ప్రమాదం జరిగిన నాలా ప్రాంతాన్ని, బండ చెరువును పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. నాలాలపై వెంటనే కప్పులు వెయ్యాలని సూచించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:సుమేధ ఘటనలో అధికారులపై కేసు నమోదు