తెలంగాణ

telangana

భారీ మొత్తంలో రేషన్​ బియ్యం స్వాధీనం... ముగ్గురు అరెస్టు

By

Published : Jul 11, 2020, 6:55 PM IST

మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరి పోలీస్​స్టేషన్​ పరిధిలోని బీజేఆర్​ నగర్​లోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా... 26 క్వింటాళ్ల బియ్యాన్ని, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

26  Quintals of rice caught by malkajigiri police
26 Quintals of rice caught by malkajigiri police

అక్రమంగా నిలువ ఉంచిన భారీ మొత్తం రేషన్ బియ్యాన్ని మల్కాజిగిరి పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్​స్టేషన్ పరిధిలోని బీజేఆర్​నగర్​లోని ఓ ఇంట్లో రేషన్​ బియ్యాన్ని ముగ్గురు సభ్యుల ముఠా అక్రమంగా నిలువ ఉంచింది. వీటిని నిజామాబాద్, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్​కు తరలిస్తున్నారు.

ఇంటిపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 26 క్వింటాళ్ల బియ్యంతో పాటు ఒక అశోక్ లేలాండ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి:మీ ఇంటికే కరోనా కిట్.. హోం ఐసొలేషన్ బాధితులకు మాత్రమే..!

ABOUT THE AUTHOR

...view details