మేడ్చల్ జిల్లా శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీ వాంబే నివాస సముదాయాల్లో ఓ పేద కుటుంబం ఉంటోంది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కరోనా కారణంగా పని లేకపోవడంతో భార్యాభర్తలు తమ పెద్ద కుమార్తెను తీసుకొని పటాన్చెరులోని ఓ పరిశ్రమలో పనిచేయడానికి వెళ్లారు. చిన్న కుమార్తెను, ఆమె అమ్మమ్మను ఇంటి దగ్గర ఉంచారు. వేసవి కావటం ఉక్కపోస్తుందని రాత్రి చిన్నారి, వృద్ధురాలు బయట పడుకున్నారు.
ఆరుబయట నిద్రపోతున్న పదేళ్ల బాలికపై అత్యాచారం - హైదరాబాద్లో అత్యాచార వార్తరలు
తల్లిదండ్రులు పనికి వెళ్లగా అమ్మమ్మ వద్ద ఉన్న పదేళ్ల బాలికను ఓ కామాంధుడు కాటేశాడు. శేరిలింగంపల్లి వాంబే కాలనీకి చెందిన బాలిక రాత్రి అమ్మమ్మతో కలిసి ఆరుబయట నిద్రపోయింది. దీనిని గమనించిన స్థానిక యువకుడు ఆమె నోరు నొక్కేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![ఆరుబయట నిద్రపోతున్న పదేళ్ల బాలికపై అత్యాచారం 10 Years girl raped in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7405619-981-7405619-1590828651641.jpg)
పదేళ్ల బాలికపై అత్యాచారం
ఇదే ప్రాంతానికి చెందిన నిందితుడు అర్ధరాత్రి దాటిన తరువాత వచ్చి ఆ చిన్నారి నోరు మూసేసి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అలికిడికి పక్కింటిలో ఉంటున్న బాలిక బంధువు బయటకి వచ్చి ఇక్కడేం చేస్తున్నావని ప్రశ్నించడం వల్ల అక్కడ నుంచి పరారయ్యాడు. గదిలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించారు.