మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో జడ్పీ అధ్యక్షురాలు హేమలత ఆధ్వర్యంలో సుమారు 400మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తులు ఉండొద్దనే... నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సంస్థ ఛైర్మన్ భూపతి రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ - లాక్డౌన్ సమయం
రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తులతో ఉండకూడదనే ఉద్దేశంతో... ముఖ్యమంత్రి ఆదేశాలతో నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నట్లు ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.

ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ