తెలంగాణ

telangana

ETV Bharat / state

వీహెచ్​పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కార్మికులకు సన్మానం

కరోనా వ్యాధి ప్రబలుతోన్న తరుణంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని వారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని వారి సేవలను స్మరిస్తూ.... విశ్వహిందూ పరిషత్ ,బజరంగ్ దళ్ నాయకులు రామాయంపేట మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు.

By

Published : Apr 11, 2020, 9:06 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

vishwa-hindu-parishath-and-bhajarang-dal-facilitated-sanitization-workers at medak district
విశ్వహిందూ పరిషత్ ,బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కార్మికులకు సన్మానం

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి, ఆహారం అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని... వారి సేవలు మరువలేనివని బజరంగ్ దళ్ కార్యకర్తలు పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ బజరంగ్, దళ్ కార్యకర్తలు రామాయంపేటలో పది రోజులుగా రోజూ 200 మంది పేదలకు ఆహారం, నీరు, కూరగాయలు అందిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సంఘం కార్యదర్శి పుట్టి మల్లేశం, పబ్బ సత్యనారాయణ, సంగమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కరోనాపై ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details