మెదక్లోని రాయిన్పల్లిలో జరిగిన ఘటనపై పునర్ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లును ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టి రాజు కోరారు. కులం పేరుతో దూషించారని చెప్పి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయమన్నారు. నియోజకవర్గ ఇంఛార్జీ జాల సాయిబాబా, బాధితులు కలెక్టరేట్లో ధర్నా చేశారు.
అడిషనల్ కలెక్టర్కు పుట్టి రాజు వినతి పత్రం అందజేశారు. రాయిన్పల్లికి చెందిన ముదిరాజ్ యువతికి నర్సాపూర్ వ్యక్తితో పెళ్లి జరిగిందని ఆయన తెలిపారు. వివాహం అయిన తరువాత అమ్మాయిని అబ్బాయి మానసికంగా వేధించాడనిపేర్కొన్నారు.