తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం - rain in medak district

మెదక్ జిల్లా మనోహరాబాద్​ మండలం రామయపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షపు నీరు చేరడం వల్ల కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎన్​హెచ్​ఏఐ సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని ఎత్తి పోశారు.

Traffic was disrupted due to water under the railway bridge
మెదక్ జిల్లాలో వర్షంతో రాకపోకలకు అంతరాయం

By

Published : Sep 26, 2020, 2:27 PM IST

వర్షపు నీరు నిలవడం వల్ల మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామయపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. చాలా సేపటి వరకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రంగంలోకి దిగిన ఎన్​హెచ్​ఏఐ సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని ఎత్తి పోశారు. రహదారిపై వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్​ను పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు.

ABOUT THE AUTHOR

...view details