తెలంగాణ

telangana

ETV Bharat / state

"పోషకాహారం వల్ల ఎన్నో ప్రయోజనాలు"

మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్​లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.

By

Published : Sep 27, 2019, 11:14 PM IST

పోషణ్ అభియాన్ కార్యక్రమం

పోషకాహారం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపారు మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు. మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్​లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. దేశంలో చాలా మంది " వయస్సుకు తగ్గ బరువు ఎత్తు" పెరగడం లేదనే ఆలోచనతో ప్రధానమంత్రి పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని డీఎమ్​హెచ్​ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి షేక్ రసూల్ బీ, సీడీపీఓ పద్మావతి, భార్గవి, అంగన్వాడీ సూపర్​వైజర్లు, టీచర్లు, గర్భిణీలు పాల్గొన్నారు.

పోషణ్ అభియాన్ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details