తెలంగాణ

telangana

ETV Bharat / state

రెడ్డిపల్లి పీహెచ్​సీని సందర్శించిన రాష్ట్ర పరిశీలకులు - state observer visited reddipalli phc

మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకులు కలిమోద్దీన్ సందర్శించారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్నందున జిల్లాలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు.

state observer visited reddipalli primary healthcare center
రెడ్డిపల్లి పీహెచ్​సీని సందర్శించిన రాష్ట్ర పరిశీలకులు

By

Published : Aug 18, 2020, 7:50 PM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర పరిశీలకులు కలిమోద్దీన్ సందర్శించారు. కొవిడ్-19 ప్రబలుతున్న తరుణంగా జిల్లాలో ఎలాంటి వైద్య సేవలందిస్తున్నారో ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించారు.

కరోనా సోకిందనే అనుమానంతో వచ్చిన వారికి పరీక్షలు జరిపి తగిన సూచనలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. రాష్ట్ర పరిశీలకుడు కలిమోద్దీన్ వెంట జిల్లా ఉపవైద్యాధికారి విజయనిర్మల, వైద్యాధికారి ప్రియదర్శిని, సుగుణాకర్, లక్ష్మీమంగ ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details