తెలంగాణ

telangana

రైతన్నగోస.. నర్సాపూర్​లో సంతకాల సేకరణ

By

Published : Nov 3, 2020, 6:54 PM IST

రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుని మార్చుకోవాలని మెదక్​ పార్లమెంట్​ నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​ఛార్జ్​ అనిల్​కుమార్​ అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నర్సాపూర్​లో రైతన్నగోస కార్యక్రమాన్ని నిర్వహించారు.

signature collection at narsapur in medak district by congress party
రైతన్నగోస.. నర్సాపూర్​లో సంతకాల సేకరణ

రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంతకాల సేకరణ చేపట్టినట్లు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్​​ ఇన్​ఛార్జ్​ అనిల్‌కుమార్‌ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధీ పిలుపు మేరకు రెండు కోట్ల సంతకాల సేకరణలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్​లోని రైతులు, ప్రజల నుంచి సంతకాలను సేకరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ విషయంలో రైతుల తరఫున తాము ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జిల్లా ఇన్​ఛార్జ్​ నగేష్ ముదిరాజ్, ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్‌, సోమన్నగారి లక్ష్మీ, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:బంగారు తెలంగాణ కేసీఆర్​ కుటుంబానికే.. ప్రజలకు కాదు: మాణిక్కం

ABOUT THE AUTHOR

...view details