తెలంగాణ

telangana

ETV Bharat / state

కుచన్​పల్లి చెక్​డ్యాం సందర్శించిన శేరి సుభాష్​ రెడ్డి -

మెదక్​ జిల్లాలోని కుచన్​పల్లి గ్రామంలో నిర్మించిన చెక్​ డ్యాం వద్ద ఎమ్మెల్సీ శేరి ​ సుభాష్​ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ జలాశయం ద్వారా చుట్టు గ్రామాల్లో ఉన్న భూగర్భ జలాలు నిండుకుని సంవత్సరానికి రెండు పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు.

కుచన్​పల్లి చెక్​డ్యాం సందర్శించిన శేరి సుభాష్​ రెడ్డి

By

Published : Aug 7, 2019, 4:49 PM IST

మెదక్​ జిల్లాలో మంజీరా నదిపై నూతనంగా నిర్మించిన చెక్ డ్యాం వద్ద ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పూజలు నిర్వహించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్​ జిల్లా హావేలి ఘణపూర్ మండలం కుచన్ పల్లి గ్రామ సమీపంలోని మంజీర నదిపై నూతనంగా నిర్మించిన చెక్ డ్యాం పూర్తిగా నిండటంతో జలకళ సంతరించుకుంది.

చెక్​ డ్యాం ద్వారా ఐదు వేల ఎకరాల రైతులు లబ్ధి పొందనున్నట్లు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తెలిపారు. జలాశయం ద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఫరీద్​పూర్, కుచన్​పల్లి, గాంధారిపల్లి, ఎల్లాపూర్, ర్యాలమడుగు గ్రామాలు దీని ద్వారా ఎక్కువ లబ్ది పొందనున్నట్లు ఆయన తెలిపారు.

కుచన్​పల్లి చెక్​డ్యాం సందర్శించిన శేరి సుభాష్​ రెడ్డి

ఇవీ చూడండి: 'లోక్​సభ సమావేశాల ఆల్​టైమ్​ రికార్డ్​'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details