తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2019, 9:14 AM IST

ETV Bharat / state

మెదక్​ జిల్లాలో కందిపంట దగ్ధం

ఆరుగాలం కష్టపడి పండించిన పంట అగ్గిపాలైంది. మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం రామచంద్రాపూర్​ గ్రామంలో రెండెకరాల కంది పంట కాలి బూడిదైంది.

red gram crop got burnt in medak district due to short circuit
మెదక్​ జిల్లాలో కందిపంట దగ్ధం

మెదక్​ జిల్లాలో కందిపంట దగ్ధం

మెదక్​ జిల్లా నర్సాపూర్ మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన మల్లేశం, కిష్టయ్య చెరో ఎకరం కంది పంటను సాగుచేశారు.

ఆ పొలంలో విద్యుత్ నియంత్రిక తక్కువ ఎత్తులో ఉంది. షార్ట్​ సర్క్యూట్​ వల్ల మంటలు చెలరేగి కందిపంట సగం వరకు కాలి బూడిదైంది. గమనించిన రైతులు మంటలు అర్పివేశారు.

విద్యుత్​ నియంత్రికను తొలగించమని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా.. పట్టించుకోలేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details