మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న రైల్వే వంతెనలోకి నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంటోంది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా రెండేళ్ల క్రితం మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి రూ.100 కోట్లతో రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదటి దశలో మనోహరాబాద్- గజ్వేల్ మధ్య పనులు వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో జాతీయ రహదారిని ధ్వంసం చేసి ఇరువైపులా వంతెన నిర్మాణ పనులు చేపట్టారు.
ఆ మార్గంలో తిరిగే వాహనాలను సర్వీస్ రోడ్డుకు మళ్లించి రైల్వే అధికారులు పట్టాల ఏర్పాటును పూర్తి చేశారు. అంత వరకు బాగానే వంతెన కిందకు చేరిన వాననీరు పోయేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వాహనాలు వెళ్లేందుకు నిర్మించిన సర్వీస్ రోడ్డులో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి మనోహరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని నీరంతా వచ్చి వంతెనలోకి చేరుతోంది.
ఫలితంగా ఇరువైపులా నిర్మించిన సర్వీస్ రోడ్డు వంతెనలో భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రెండు రోజుల క్రితం ఇదే పరిస్థితి నెలకొంది. దేశంలోనే అత్యంత పొడవైన 44వ జాతీయ రహదారిపై నిత్యం 8 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అల్లాపూర్ టోల్గేట్ వద్ద నిత్యం రూ.12 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది.
పనులు వేగంగా సాగితేనే..