మెదక జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వీధిలో పోలిసులు కట్టడిముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సీఐ నాగయ్య ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, నలుగరు ఏఎస్సైలు, 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 15 ద్విచక్రవాహనాలు, 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సూచించారు. వాహనాలను ఇళ్లముందు నిలపడం వలన ఇతరులకు ఇబ్బందులు వస్తాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో ముందస్తుగా తనీఖీలు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
నర్సాపూర్లో కట్టడి మట్టడి.. పలు వాహనాలు స్వాధీనం - నర్సాపూర్లో పోలీసులు కట్టడి మట్టడి
మెదక్ జిల్లా నర్సాపూర్లోని శివాలయం వీధిలో పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 15 ద్విచక్రవాహనాలు, 4 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
నర్సాపూర్లో పోలీసులు కట్టడి మట్టడి