మెదక్ జిల్లా హవేలీ ఘనపురం మండలం కుచంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. పదో తరగతి ఫలితాల్లో పదికి పది మార్కులు సాధించిన అమృతను సుభాష్ రెడ్డి ఘనంగా సన్మానించారు. తన సొంత డబ్బులతో అమృత ఫోటొను నోట్బుక్లపై ప్రచురించి పంపిణీ చేశారు. అమృత లాగే విద్యార్థులందరూ అధిక మార్కులు సాధించాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు.
విద్యార్థిని ఫొటోతో నోట్బుక్స్ పంపిణీ - mlc
మెదక్ జిల్లా కుచంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. వాటిపై పదో తరగతిలో పదికి పది మార్కులు సాధించిన విద్యార్థిని అమృత ఫొటో ప్రచురించారు. ఆమెలాగే అందరూ గొప్ప మార్కులు తెచ్చుకోవాలన్నారు.

విద్యార్థిని ఫొటోతో నోట్బుక్స్ పంపిణీ
విద్యార్థిని ఫొటోతో నోట్బుక్స్ పంపిణీ