తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాం షుగర్స్​ అమ్మకానికి ట్రిబ్యునల్​ గ్రీన్​ సిగ్నల్​ - employs

ఆసియాలోనే ప్రఖ్యాతి గాంచిన నిజాం దక్కన్ షుగర్స్ కర్మాగారాలు మూతపడనున్నాయి. మెదక్ జిల్లాలో ఉన్న  ఏకైక  నిజాం షుగర్ ఫ్యాక్టరీ  ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల భాగస్వామ్యంతో కొనసాగుతున్న  ఎన్​డీఎస్ఎల్ కర్మాగారం ఇక కనుమరుగుకానుంది.

నిజాం షుగర్స్​ అమ్మకానికి ట్రిబ్యునల్​ గ్రీన్​ సిగ్నల్​

By

Published : Jun 14, 2019, 11:21 PM IST

మెదక్​ జిల్లాలోని నిజాం దక్కన్​ షుగర్స్​ లిమిటెడ్​ కనుమరుగు కానుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల 307 మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతోంది. ఈరోజు మెదక్ మండలంలోని మంభోజిపల్లిలో ఉన్న నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్​పై గురువారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విక్రయానికి ఆదేశాలు జారీ చేయడం వల్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారు.సీఐటీయూ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటు వద్ద ఈరోజు కార్మికులు ధర్నా చేశారు. మెదక్​లో ఎన్ఎస్ఎల్​ కర్మాగారం ఏర్పాటై వందలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభించింది. చెరుకు రైతులకు చేతినిండా పని లభించింది. కానీ నేడు పరిశ్రమను మూతపడే పరిస్థితికి తీసుకువచ్చారు. మెదక్​లోని ఎన్ఎస్ఎల్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్​కు హాజరు కాకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు.

నిజాం షుగర్స్​ అమ్మకానికి ట్రిబ్యునల్​ గ్రీన్​ సిగ్నల్​

ABOUT THE AUTHOR

...view details