ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మెదక్ జిల్లా పాపన్న పేట్ మండలం నాగ్సన్పల్లి గ్రామంలోని వనదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు అమ్మవారు శ్రీకూష్మాండాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
కూష్మాండదేవి అవతారంలో ఏడుపాయల వనదుర్గ మాత
ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మనారు కూష్మాoడాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
కూష్మాండదేవి అవతారంలో ఏడుపాయల వనదుర్గ మాత
రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆలయ ఈవో సార శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చూడండి:భద్రాద్రిలో కనులవిందుగా దేవి శరన్నవరాత్రులు