తెలంగాణ

telangana

By

Published : Apr 20, 2021, 5:55 PM IST

ETV Bharat / state

'సీఎం కేసీఆర్​ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు'

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని... ఎమ్మెల్సీ శేరి సుభాశ్​ రెడ్డి అన్నారు. ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

MLC Sheri Subhash Reddy prayed for cm kcr health
సీఎం కేసీఆర్​ కోసం ఎమ్మెల్సీ శేరి సుభాశ్​ రెడ్డి పూజలు

ప్రజల అభిమానం, భగవంతుని ఆశీస్సులు సీఎం కేసీఆర్​పై మెండుగా ఉన్నాయని... ఎమ్మెల్సీ శేరి సుభాశ్​ రెడ్డి అన్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని తెలిపారు. ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారిని దర్శంచుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజలు చేస్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి

సీఎం కేసీఆర్​ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి ఆకాంక్షించారు. నిజాంపేట మండలం చల్మెడలోని గాయత్రి మాత ఆలయంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్​తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ

ABOUT THE AUTHOR

...view details