తెలంగాణ

telangana

గడువులోగా పార్టీ సభ్యత్వం పూర్తి చేయాలి : హరీశ్ ​రావు

తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్​ రావు సూచించారు. మెదక్ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెరాస ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

By

Published : Feb 24, 2021, 10:39 PM IST

Published : Feb 24, 2021, 10:39 PM IST

minister harish rao on trs party membership programme meeting in medak district
పార్టీ సభ్యత్వ గడువులోగా పూర్తి చేయాలి : హరీశ్ ​రావు

గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారని మంత్రి హరీశ్​ రావు అన్నారు. తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు. మెదక్​ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

పార్టీ సభ్యత్వం వల్ల ప్రతి ఒక్కరికి రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రక్రియను త్వరగా ముగించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గంగాధర్, మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు, నియోజకవర్గ మండలాల పార్టీ అధ్యక్షులు, ఛైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :'విజయం కోసం భాజపా వ్యూహం.. పార్టీనేతలకు బండి మార్గనిర్దేశం'

ABOUT THE AUTHOR

...view details