తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2020, 7:49 PM IST

ETV Bharat / state

మెదక్​లోని ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్​ అమలు: కలెక్టర్​

మెదక్​ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి మండలాల్లో జరగనున్న ఉపఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్​ ఎం.హనుమంతరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల జరిగే ప్రాంతాల్లో నవంబర్​ 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్​ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.

medak collector meeting about dubbaka byelections
మెదక్​లోని ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్​ అమలు: కలెక్టర్​

మెదక్​ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి మండలాల్లో నవంబర్​ 3న ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్​ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన చర్యలపై కలెక్టర్​ ఎం.హనుమంతరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పోలింగ్​ సమయంలో సిబ్బంది కొరత ఉండకుండా చూడాలని సంబంధిత నోడల్​ అధికారికి తెలిపారు.

అధికారులతో మాట్లాడుతున్న మెదక్​ కలెక్టర్​ హనుమంతరావు

పోలింగ్​ ప్రక్రియకు సంబంధించి ఉదయం 6 గంటలకే మాక్​ పోలింగ్​ నిర్వహిస్తామని.. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్​ను ప్రారంభిస్తామని కలెక్టర్ ​ చెప్పారు. ఓటర్లు కరోనా నిబంధనలను పాటిస్తూనే పోలింగ్​లో పాల్గొనాలని సూచించారు. పోలింగ్​ కేంద్రాల్లో విద్యుత్తు సరఫరా, సెంటర్ల ముందు టెంట్లు, తాగునీటి వసతితో పాటు వీల్​ఛైర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని హనుమంతరావు వివరించారు.

ఎన్నిక జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శనివారం నుంచి నవంబర్​ 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్​ అమలులో ఉంటుందని హనుమంతరావు పేర్కొన్నారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగుంపులుగా తిరిగితే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార సమయం ముగుస్తుందని.. ఆ తర్వాత ఎక్కడా మైకులు, లౌడ్ స్పీకర్లు వాడటం, పాటలు పాడటం, ఉపన్యాసాలు ఇవ్వడం వంటివి చేయకూడదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండిః'దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి'

ABOUT THE AUTHOR

...view details